రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ (Exit polls) అంచనా వేశాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. నవంబర్ 7న 20 స్థానాలకు, నవంబర్ 17న 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46. అయితే కాంగ్రెస్ 40-50, బీజేపీ 35-45, ఇతరులు 0-3 స్థానాల్లో గెలుస్తాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యత కనిపించింది. కాంగ్రెస్కు 40-50 సీట్లు వచ్చే అవకాశం ఉందని సూచించింది. బీజేపీ 36-46 స్థానాల వరకు రావచ్చని అంచనా వేసింది. మిగిలిన పార్టీలు 1-5 స్థానాలు కైవసం చేసుకుంటాయని పేర్కొంది.
జన్ కీ బాత్ అంచనా ప్రకారం కాంగ్రెస్కు 42-53 సీట్లు, బీజేపీకి 34-45 సీట్లు, ఇతరులకు 3 సీట్లు రానున్నాయి.
న్యూస్ 24- టుడేస్ చాణక్య ప్రకారం కాంగ్రెస్కు 57 సీట్లు, బీజేపీకి 33 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
ఏబీపీ న్యూస్-సీ ఓటర్ ఎగ్జిట్ ప్రకారం కాంగ్రెస్కు 41-53, బీజేపీకి 36-48, ఇతరులకు 0-4 సీట్లు రానున్నాయి.
దైనిక్ భాస్కర్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 46-55, బీజేపీకి 35-45, ఇతరులకు 0-10 సీట్లు దక్కుతాయి.
ఇండియా టీవీ – సీఎస్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ మేరకు కాంగ్రెస్కు 46-56, బీజేపీకి 30-40, ఇతరులకు 3-5 సీట్లు రానున్నాయి.
రిపబ్లిక్ టీవీ- మ్యాట్రిజ్ అంచనా ప్రకారం కాంగ్రెస్కు 44-52, బీజేపీకి 34-42, ఇతరులకు 0-2 స్థానాలు దక్కనున్నాయి.
టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 48-56, బీజేపీకి 32-40, ఇతర పార్టీలకు 2-4 సీట్లు రానున్నాయి.
టీవీ 9 భరత్వర్ష్ – పోల్స్టర్ ప్రకారం కాంగ్రెస్కు 40-50, బీజేపీకి 35-45, ఇతరులు 0-3 సీట్లు గెలుస్తాయి.