మంచి ఆకలి మీద కూర్చున్నప్పుడు ఆహారంలో పురుగులు వస్తే ఎలా ఉంటుంది? రాణి అనే మహిళకు అలాంటి అనుభవమే ఎదురైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఆమె నివశిస్తోంది. ఇక్కడ బాగా పాపులర్ అయిన వెజిటేరియన్ రెస్టారెంట్ ‘నమ్మ విద్య వసంత భవన్’లో భోజనం చేయడానికి ఆమె వెళ్లింది. చోలా పురి ఆర్డర్ ఇచ్చింది. తనకు వచ్చిన ఆహారంలో పురుగులు లుకలుకలాడుతూ కనిపించాయి.
అది చూసిన రాణికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రెస్టారెంటులో తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని రెస్టారెంట్ యజమానికి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.