న్యూఢిల్లీ: క్యాన్సర్ చికిత్స అనగానే గుర్తుకువచ్చేవి రేడియేషన్, కీమోథెరపీ. క్యాన్సర్ కణాలతోపాటే ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేసే ఈ బాధాకరమైన చికిత్స ఇక ఏమాత్రం అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికా క్లెవ్ల్యాండ్ క్లినిక్కు చెందిన 11 మంది శాస్త్రవేత్తలు అలహాబాద్ వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మునీష్ పాండే సహకారంతో నిర్వహించిన పరిశోధన విజయవంతమైంది. క్యాన్సర్ బయాలజీ ప్రొఫెసర్ యాంగ్ లీ నేతృత్వంలోని ఈ బృందం ఎంఐఆర్ 21 అనే ఆర్ఎన్ఏ ఆధారిత ఔషధాన్ని తయారు చేసింది. ఇది ఆరోగ్యకరమైన కణాలను వదిలేసి క్యాన్సర్ కణాలనే చంపేస్తుంది. ఈ విధానంలో కీమో, రేడియేషన్ అవసరం ఉండదు.ఎలుకలపై ప్రయోగాలు విజయవంతమయ్యాయని, త్వర లో మనుషులపై ప్రయోగాలు జరుపుతామని మునీశ్ తెలిపారు. ఈ చికిత్స అందుబాటులోకి వస్తే బాధాకరమైన కీమో చికిత్స నుంచి విముక్తి లభిస్తుందని వివరించారు. ఈ పరిశోధన ఫలితాలను ప్రతిష్ఠాత్మకమైన ‘ఆంకోజీన్ బై నేచర్’ జర్నల్లో ప్రచురించారు.