లఖింపూర్ ఖీరీ: లఖింపూర్ హింసాకాండ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతో పాటు మరో 12 మందిపై స్థానిక కోర్టు మంగళవారం అభియోగాలు నమోదు చేసింది.
రైతులను కారుతో తొక్కించిన కేసులో హత్య, నేరపూరిత కుట్ర, తదితర అభియోగాలను రికార్డు చేయడం ద్వారా కేసు విచారణ ప్రారంభానికి మార్గం సుగమం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 16న జరుగనుంది.