Cyclone Biparjoy | అరేబియా సముద్రం (Arabian Sea)లో ఏర్పడిన ‘బిపర్జోయ్’తుపాను (Cyclone Biparjoy) అతి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను ప్రభావం ముంబై విమానాశ్రయంపై పడింది. భారీ వర్షానికి తోడు బలమైన గాలులు వీస్తుండటంతో విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాలుల తీవ్రతతో ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దుకాగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానాశ్రయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ప్రయాణికులు ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
@JM_Scindia sir we are waiting more than 5 hours at Mumbai airport flight time was 11 pm but now due to unavailability of captain/pilot they are saying 4.40 am
Si this relavant they are not providing acomadation too. @DGCAIndia @IndiGo6E pic.twitter.com/KqlwVHQ78N— DURGESH TIWARI (@tiwaridurgesh89) June 11, 2023
మరోవైపు తుపాను కారణంగా నెలకొన్న పరిస్థితులపై ఎయిర్ ఇండియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబై విమానాశ్రయంలోని రన్వేను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రద్దయ్యాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది. ఇండిగో కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. తుపాను ప్రభావంతో ముంబైలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
IMPORTANT INFORMATION:
Inclement weather conditions and the temporary closure of Runway 09/27 at the Mumbai airport, in addition to other consequential factors beyond our control have resulted in delays and cancellation of some of our flights. We regret the inconvenience caused…
— Air India (@airindia) June 11, 2023
‘బిపర్జోయ్’తుపాను గుజరాత్ లోని కచ్, పాకిస్థాన్ లోని కరాచీల మధ్య గురువారం (ఈనెల 15వ తేదీన) తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటలకు 135-150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచాన వేసింది.
ఈ తుపాను ప్రభావం కచ్, జామ్నగర్, మెర్బి, గిర్ సోమనాథ్, పోర్బందర్, దేవభూమి, ద్వారక జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని పేర్కొంది. జూన్ 13-15 తేదీల మధ్య భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, కేరళ, కర్ణాటక,మహారాష్ట్ర, లక్షద్వీప్ల తీరాల్లోనూ అలల ఉద్ధ`తి ఎక్కువగా ఉంది. దీంతో జూన్ 15 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది.
Sir, we can surely understand the agony as flight delays are equally troublesome for us. It is only under extremely uncontrollable situations we're compelled to make such changes in the schedule. We look forward to your kind understanding. ~Kiran
— IndiGo (@IndiGo6E) June 12, 2023
Also Read..
Warkaris | పూణెలో ఉద్రిక్తత.. వార్కారీ భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్
Telangana Run | రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్.. ఫొటోలు
Singareni | బోనస్ బొనాంజా.. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా.. ఉద్యోగులు, కార్మికుల్లో హర్షం