Chandrayaan-4 | చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు ఉద్దేశించిన ‘చంద్రయాన్-4’ (Chandrayaan-4) ప్రయోగంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ (ISRO Chief) ఎస్.సోమనాథ్ (S Somnath) కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రయోగం అభివృద్ధి దశలో ( under development) ఉందని చెప్పారు.
పంజాబ్ లుథియానాలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొని మాట్లాడారు. అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ విషయంలో మన దేశం (India) గొప్ప పురోగతిని సాధిస్తోందన్నారు. చంద్రుడిపై తదుపరి మిషన్కు ఇస్రో కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 2040 నాటికి చంద్రుడిపై ల్యాండింగ్ చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ఇస్రో నిరంతరం దానిపై పనిచేస్తోందని ఆయన అన్నారు.
‘చంద్రయాన్-4 అనేది చంద్రయాన్ సిరీస్కు కొనసాగింపు. ఇది ఇప్పుడు అభివృద్ధి దశలో ఉంది. 2040లో ఒక భారతీయుడు చంద్రుడిపై అడుగుపెడతాడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అది జరగాలంటే మనం వివిధ రకాల చంద్రుడిపై అన్వేషణను కొనసాగించాల్సి ఉంటుంది. దీనిపై ఇస్రో నిరంతరం పనిచేస్తోంది’ అని సోమనాథ్ పేర్కొన్నారు.
Also Read..
Supreme court | సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురు.. ఇక సోమవారమే కేజ్రీ పిటిషన్పై విచారణ..!