న్యూఢిల్లీ, జూలై 18: భూమికి 341 కిలో మీటర్ల ఎత్తులో తిరుగుతున్న చంద్రయాన్-3ని ఇటలీలోని మనాసియానోలో ఉన్న వర్చువల్ టెలిస్కోప్ వీడియో తీసి విడుదల చేసింది. రియల్టైమ్ కవరేజీకి పేరుగాంచిన ఈ టెలిస్కోప్ ప్రాజెక్టు విడుదల చేసిన వీడియోలో చంద్రయాన్-3 ఓ చుక్కలా మెరుస్తూ కనిపిస్తున్నది.
మరోవైపు మూడోసారి మంగళవారం చంద్రయాన్-3 కక్ష్యను విజయవంతంగా పెంచారు. ఈ నెల 20న మధ్యాహ్నం 2-3 గంటల మధ్య మరోమారు దాని కక్ష్యను పెంచనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా దాని ఎత్తును పెంచుకుంటూ చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లిన తర్వాత ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్ చేస్తారు. ఆ రోజు కోసమే ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.