Chandrababu Naidu | న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది. దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో కూడిన నివేదికను సోమవారం ఏడీఆర్ విడుదల చేసింది. చంద్రబాబు నాయుడుకు అత్యధికంగా రూ.931 కోట్ల ఆస్తి ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది.
31 ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి కలిపి రూ.1,630 కోట్లు ఉంది. వీరందరి ఆస్తి కలిపితే సగటున రూ.52.59 కోట్లు ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. సీఎంల సగటు ఆదాయం ఏడాదికి రూ.13,64,310. ఇది దేశ సగటు తలసరి ఆదాయం కంటే 7.3 రెట్లు అధికం. ముఖ్యమంత్రులు అందరిలో తక్కువ ఆస్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉంది. ఆమెకు రూ.15 లక్షలు మాత్రమే.