న్యూఢిల్లీ : టమాటాలు సహా కూరగాయల ధరలు మండుతుంటే త్వరలో తృణ ధాన్యాల (Cereal shortages) ధరలు మోతెక్కుతాయని హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ పీఎల్సీ నివేదిక హెచ్చరించింది. తృణ ధాన్యాల కొరతతో బియ్యం, గోధుమలు, కొర్రలు, జొన్నలు, రాగులు సహా పలు తృణధాన్యాల ధరలు చుక్కలు చూస్తాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.
తృణ ధాన్యాల ధరలు పెరగడంతో రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం ఎగబాకుతుందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టమాటాల ధరల పెరుగుదల పక్కనపెడితే బియ్యం, గోధుమలతో కూడిన తృణ ధాన్యాల కొరత వేధిస్తోందని, వినియోగదారుల ధరల సూచీలో బియ్యం, గోధుమలే పది శాతం వరకూ ఉంటాయని దీంతో వీటి ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్ధిక వేత్లు ప్రంజుల్ భండారీ, ఆయుషి చౌధరి పర్కొన్నారు.
2024 మార్చి నాటికి ద్రవ్యోల్బణం 5 శాతానికి చేరుతుందని హెచ్సీబీసీ తన ఇన్ఫ్లేషన్ అంచనాలో పేర్కొంది. దక్షిణాది, తూర్పు ప్రాంతంలో తగినంత వర్షం లేకపోవడం, ఉత్తరాదిలో సాగు విస్తీర్ణం తగ్గడంతో వరి, గోధుమల పంటపై ప్రభావం చూపుతాయని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్ నుంచి రైస్ ఎగుమతులపై ఇది ప్రభావం చూపుతుందని తెలిపింది. గోధుమల దిగుబడి, పంపిణీపైనా ప్రతికూల ప్రభావం ఉంటుందని హెచ్ఎస్బీసీ రిపోర్ట్ అంచనా వేసింది.
Read More :
Tomato | అప్పుడు టమాటలు పండిస్తే కూలీ డబ్బులు కూడా రాలేదు.. ఇప్పుడు కోటీశ్వరులు అవుతున్న టమాట రైతులు