రాంచీ, నవంబర్ 19: దేశ రాజ్యాంగ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నదని సీపీఎం నాయకురాలు బృందాకారత్ ధ్వజమెత్తారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై ఈడీ, సీబీఐ, ఐటీని ‘త్రిశూలం’గా ఉపయోగిస్తున్నదని పేర్కొన్నారు. శనివారం ఆమె జార్ఖండ్ రాజధాని రాంచీలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమ ముందు మోకరిల్లేంతవరకూ ఈ త్రిశూలాన్ని కేంద్రం ప్రయోగిస్తున్నదని ఆరోపించారు. విపక్షపాలిత రాష్ర్టాలను అస్థిరపరిచేందుకు గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటున్నదని విమర్శించారు.