న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 116.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. రాష్ట్రాల వద్ద ఇంకా 15.54 కోట్ల వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడిఉందని తెలిపింది.
పెద్దసంఖ్యలో వ్యాక్సిన్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపుతూ ముందస్తు సమాచారం చేరవేస్తున్నామని, మెరుగైన ప్రణాళికలతో రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని కోరింది. వ్యాక్సిన్ సప్లై చెయిన్ను ఎప్పటికప్పుడు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.