GST Compensation | జీఎస్టీ పరిహారం కింద తెలంగాణకు రూ.1264.78 కోట్లు, ఏపీకి రూ.905.59 కోట్ల మేరకు కేంద్ర ఆర్థికశాఖ గురువారం విడుదల చేసింది. తెలంగాణ, ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. రుణ సదుపాయం మిగులు కింద కేంద్రం రూ.44 వేల కోట్లు రిలీజ్ చేసింది. దీంతో ఇప్పటివరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.59 లక్షల కోట్లు విడుదల చేసినట్లయింది.