న్యూఢిల్లీ, డిసెంబర్ 26: డీప్ఫేక్ ఘటనలపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సోషల్ మీడియా సంస్థలకు అడ్వైజరీ జారీచేసింది. ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ పేర్కొన్నది.
నిషేధిత కంటెంట్కు సంబంధించిన వివరాలను యూజర్లకు తప్పనిసరిగా స్పష్టంగా, కచ్చితంగా తెలియజేయాలని డిజిటల్, సోషల్ మీడియా వేదికలను ఆదేశించింది. యూజర్లు తొలిసారిగా ఖాతాలను రిజిస్టర్ చేసుకొనే సమయంలో సమాచారం రూపంలో తెలియపరచాలని, సమ్మతి తీసుకోవాలని పేర్కొన్నది.