అంతర్జాతీయ మార్కెట్ల్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ప్రస్తుతం ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది. అయినా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం కంపెనీలు తగ్గించటం లేదు. గత ఫిబ్రవరిలో బ్యారల్ ధర 92.84 డాలర్లు ఉండగా, అది గత వారం 90 డాలర్ల దిగువకు పడిపోయింది. కానీ, కంపెనీలు రిటైల్ ధరలను తగ్గించకుండా లాభాలు స్వీకరిస్తున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: అచ్చే దిన్ అంటూ సచ్చే దినాలు తెచ్చిన కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్పై పన్నుల రూపంలో ప్రజలను ఎలా దోపిడీ చేస్తున్నదో మరోసారి బయటపడింది. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు ఏటా ఎక్సైజ్ పన్నులు పెంచుతూనే పోయిందని చమురు శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) లెక్కలే తేటతెల్లం చేశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా మనదేశంలో పెట్రోల్, డీజిల్పై పన్నులు పెంచుతూనే ఉన్నారని తేలిసింది. ఈ ఎనిమిదేండ్లలో కేంద్రం పెట్రోల్పై 194 శాతం ఎక్సైజ్ పన్నును పెంచగా, డీజిల్పై ఏకంగా 512 శాతం పన్ను పెంచిందని పీపీఏసీ గణాంకాలు చెప్తున్నాయి.
పీపీఏసీ గణాంకాల ప్రకారం..