ఇప్పటికీ జీఎస్టీ కౌన్సిల్కు నివేదిక
సమర్పించని మంత్రుల బృందం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పన్ను రేట్లు పెంచే విషయంలో రాష్ర్టాల నుంచి జీఎస్టీ కౌన్సిల్ అభిప్రాయాలు తెలుసుకోలేదని తెలుస్తున్నది. మంత్రుల బృందం ఇప్పటికీ జీఎస్టీ కౌన్సిల్కు నివేదిక సమర్పించలేదని సమాచారం.
143 వస్తువులపై పన్ను రేట్లు పెంచే విషయంలో రాష్ర్టాలను సంప్రదించలేదని, 28 శాతం శ్లాబ్లోకి పలు వస్తువులను చేర్చడంపైనా ప్రతిపాదనేమీ లేదని అధికారులు వెల్లడించారు. కాగా, జీఎస్టీ రేట్ల పెంచడంపై కేంద్రంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రజలతో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని దుయ్యబట్టింది.