Sainik Schools | న్యూఢిల్లీ: దాదాపు 62% కొత్త సైనిక్ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం సంఘ్ పరివార్, బీజేపీ నేతలకు అప్పగించిందని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తాజా కథనం పేర్కొన్నది. ప్రభుత్వ మీడియా ప్రకటనలు, పలు ఆర్టీఐ సమాధానాలను క్రోడీకరించిన తర్వాత ఈ మేరకు వెల్లడైందని తెలిపింది.
ఇప్పటి వరకు జరిగిన 40 సైనిక్ స్కూళ్ల ఒప్పందాల్లో కనీసం 62 శాతం పాఠశాలలను ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు, బీజేపీ నేతలు, పలు హిందూత్వ సంస్థలు, వ్యక్తులకు మోదీ సర్కార్ కేటాయించినట్టు తమ అధ్యయనంలో తేలిందని బుధవారం పేర్కొన్నది. 2021లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని సైనిక్ స్కూళ్లను నడిపేందుకు ప్రైవేటు వ్యక్తులకు తలుపులు బార్లా తెరిచింది.