పుణె, మే 10: నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 100 శాతం విఫలమైందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు. ‘అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని 2014లో బీజేపీ చెప్పింది. కానీ ఇప్పటికీ పరిష్కరించలేదు.
ద్రవ్యోల్బణం పరిస్థితీ ఇదేనన్నారు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మత వివాదాలను తెరపైకి తెస్తున్నది. ఇలా ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు. ప్రజలు అమాయకులు కాదు. సమయం కోసం చూస్తున్నారు. కర్రు కాల్చి వాతపెడుతారు’ అని హెచ్చరించారు.