న్యూఢిల్లీ: నాగాలాండ్లోని (Nagaland) తొమ్మిది జిల్లాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (AFSPA) అమలును మరో ఆరు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అందులో నాలుగు జిల్లాల్లోని 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను కల్లోలిత ప్రదేశాలుగా గుర్తించింది. నేటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
అదేవిధంగా అరుణాచల్ప్రదేశ్లోని తిరప్, చంగ్లాంగ్, లాంగ్డింగ్, నమ్సాయ్ జిల్లాలోని నమ్సాయ్, మహాదేవ్పూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ చట్టం అమల్లో ఉంటుందని వెల్లడించింది. స్థానికంగా పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని ఏఎఫ్ఎస్పీఏను (AFPSPA) మరో ఆరు నెలల పాటు పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు ఈ చట్టం అమల్లో ఉంటుంది.
Centre has extended Armed Forces(Special Powers) Act, 1958 for 6 months from today in Tirap, Changlang and Longding dist in Arunachal Pradesh (AP) and areas falling within the jurisdiction of Namsai &Mahadevpur PS in Namsai dist of AP as they are declared as ‘disturbed area': MHA
— ANI (@ANI) October 1, 2022
Centre has extended Armed Forces (Special Powers) Act, 1958 in nine districts and 16 police stations in four districts of Nagaland as ‘disturbed area’ for a period of six months with effect from today unless withdrawn earlier.
— ANI (@ANI) October 1, 2022
సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 1958లో తీసుకొచ్చింది. గల నాలుగు దశాబ్దాలుగా నాగాలాండ్లో ఈ చట్టం అమలవుతున్నది. అప్పటి నుంచి అపరిమిత అధికారాలతో సైన్యం అతిక్రమణలకు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందనే విమర్శలున్నాయి. తిరుగుబాట్లు, నిషేధిత ఉగ్రవాద సంస్థలను అణచివేసే చర్యలు పేరుతో అమాయకులపై, మహిళలపై సైన్యం అనుచితంగా ప్రవర్తిస్తుందనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యా రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో అనేక పోరాటాలు సాగుతున్నాయి. పౌర సమాజంతో పాటు, హక్కుల కార్యకర్తుల, రాజకీయ నాయకులు సైతం ఈ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు.