రామంతాపూర్,మే1: రంజాన్ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రంజాన్ తోఫాను హబ్సిగూడ డివిజన్ పరిధిలోని నవరంగ్గూడ ఈ సాలేహీన్ మజీద్లో శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుబాష్రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షే మం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం కార్పొరేటర్ చేతనాహరీశ్ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు.కార్యక్రమంలోటీఆర్ఎస్ నాయకులు రవికుమార్,సుధాకర్, ఎండీముస్తాక్, సూరంశంకర్, బీజేపీ నాయకులు ఎల్లాచారి, శ్రీనివాస్,ప్రవీణ్, శ్రీను,మజీద్ కమిటీ సభ్యులు సయ్యద్సాదిక్గౌరి,నాగుర్వల్లి,మహ్మద్ ఖాజ, అబ్బు,సర్ధార్,అక్బర్ ఉన్నారు.