కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్టానికి ఇటీవల చేసిన సవరణలు ఎంత అవసరమో అఫ్గానిస్తాన్లోని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్లో దేశాల్లో మతపరమైన హింసకు గురయ్యే సిక్కులు, హిందువులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు పౌరసత్వం కల్పించేలా కేంద్రం సీఏఏను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.