కేంద్ర ప్రభుత్వంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మరోమారు విరుచుకుపడ్డారు. గుప్కార్ అలయెన్స్ను భయపెట్టాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. అయినా తాము భయపడమని స్పష్టం చేశారు. తామందరమూ కలిస్తే.. కేంద్రం అనుకున్న ప్రణాళికలు ముందుకు సాగవన్న భయం కేంద్రానికి పట్టుకుందని ఎద్దేవా చేశారు. కేంద్రం ఎప్పటికైనా మాజీ ప్రధాని వాజ్పాయ్, ముఫ్తీ సయీద్ తోవలోకి రావాల్సిందేనని మెహబూబా స్పష్టం చేశారు.