Padma Awards 2022 | కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్కు పద్మ విభూషణ్(మరణానంతరం)ను ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ నేత గులామ్ నబి ఆజాద్ను పద్మ భూషణ్ వరించింది.
ఈసంవత్సరానికి మొత్తం 128 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. అందులో 4 పద్మ విభూషణ్ అవార్డులు, 17 పద్మ భూషణ్, 107 పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.
పద్మ విభూషణ్ పొందిన వారిలో బిపిన్ రావత్తో పాటు మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆట్రే, ఉత్తర ప్రదేశ్కు చెందిన రాధేశ్యామ్ ఖెమ్కా(మరణానంతరం), ఉత్తరప్రదేశ్కు చెందిన కళ్యాణ్ సింగ్(మరణానంతరం) ఉన్నారు.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోకు పద్మ భూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. పద్మ భూషణ్ అవార్డును 17 మందికి ప్రకటించారు. గులామ్ నబి ఆజాద్ కూడా పద్మ భూషణ్ లిస్టులో ఉన్నారు.
తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఐదుగుర్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. భారత్ బయోటెక్కు చెందిన శ్రీకృష్ణ యెల్లా, సుచిత్రా యెల్లాకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు. అలాగే 12 మెట్ల కిన్నెర దర్శనం మొగిలయ్యతో పాటు రాంచంద్రయ్య, పద్మజారెడ్డిని పద్మశ్రీ పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Padmasri | దర్శనం మొగిలయ్య ఎవరు? ఆయన నేపథ్యమేంటి?
12 మెట్ల కిన్నెర మొగిలయ్య సహా తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు
Shaurya Chakra awards: ముగ్గురు జవాన్లకు శౌర్యచక్ర అవార్డులు.. ఇద్దరికి మరణానంతరం..!