న్యూఢిల్లీ: ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా సమ్మె చేసినా, నిరసన తెలిపినా క్రమశిక్షణా చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. పాత పింఛను పథకాన్ని(ఓపీఎస్) తిరిగి పునరుద్ధరించాలని ఉద్యోగులు బుధవారం సమ్మె చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
‘సమ్మెలో పాల్గొన్న ఉద్యోగుల జీతంలో కోతలు విధించడమే కాకుండా, తగిన క్షమశిక్షణా చర్యలు తీసుకుంటాం’ అని అందు లో తెలిపింది. సంఘాలు ఏర్పరుచుకొనే హక్కు సమ్మె చేసే హక్కును కల్పించదని స్పష్టం చేసింది.