బెంగళూరు, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని మోదీ సర్కారు మరోసారి రైతన్న గొంతు నొక్కే నిర్ణయం తీసుకొన్నది. భూటాన్ నుంచి పచ్చి వక్కల దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం కర్ణాటక రైతుల పాలిట శాపంగా మారింది. గతంలో దిగుమతి చేసుకొనే వకకు కనీస ధర కిలోకు రూ.251గా నిర్ణయించారు. దీనివల్ల దేశీయ రైతులకు మంచి డిమాండ్ ఉండేది. కానీ, మోదీ సర్కారు కనీస ధర ఆంక్ష నిబంధనను రద్దు చేసింది. భూటాన్ నుంచి 17 వేల టన్నుల పచ్చి వక్క దిగుమతికి అనుమతించింది. ఇది వక్కలు పండించే దేశీయ రైతుల పాలిట పిడుగుపాటని వ్యవసాయ, వాణిజ్య నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వ కథనం ప్రకారం.. తొలిసారిగా భూటాన్ నుంచి వకను దిగుమతి చేసుకొంటున్నారు.
ఇప్పటి వరకు ఒక దేశం నుంచి ఈ స్థాయిలో వకను దిగుమతి చేసుకొన్న దాఖలాలు లేవు. నిరుడు ఆ దేశం నుంచి దిగుమతి చేసుకొన్న వక 4 వేల టన్నులు. ఈ ఏడాది ఒకసారిగా 4 రెట్ల కంటే ఎకువ వక దిగుమతికి అనుమతివ్వటాన్ని దేశ రైతాంగం జీర్ణించుకోలేకపోతున్నది. కేంద్రం విధానం వక రైతుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టని వక, కోకో మారెటింగ్, ప్రాసెసింగ్ సహకార సంఘం అధ్యక్షుడు కిశోర్ తెలిపారు. ‘వక దిగుమతులకు తలుపులు తెరవటం దేశీయ వకల ధరలను ప్రభావితం చేయనున్నది. దేశంలో 8-10 లక్ష టన్నుల వకలు పండుతున్నాయి. ఇది దేశీయ అవసరాలను తీరుస్తున్నది. మిగులు వక్కలను ఎగుమతి కూడా చేయవచ్చు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా వక తోటలు విస్తరించాయి. వచ్చే నాలుగైదేండ్లలో మొత్తం పంట దిగుబడి 15 లక్షల టన్నులకు చేరవచ్చు’ అని తెలిపారు.
గుజరాత్ వ్యాపారుల ప్రయోజనాలకే కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకొన్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అకడి పట్టు వ్యాపారుల కోసం వాజపేయి ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి చేసుకొనే బై వోల్టిన్ పట్టుపై సుంకాన్ని 30 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పట్టు రైతులు దారుణంగా దెబ్బతిన్నారు. ఫలితంగా ఇప్పుడు ఈ రాష్ర్టాల్లో మల్బరీ తోటల విస్తీర్ణం, పట్టు దిగుమతి తగ్గుముఖం పడుతున్నది. ఇప్పుడిక వకకూ ఇదే గతి తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టు దిగుమతి సుంకాన్ని తగ్గించటం వల్ల నష్టపోయిన రైతుల్లో అత్యధికులు కర్ణాటక వారే. ఇప్పుడు వకల దిగుమతి కనీస ధరను రద్దు చేయటంతో నష్టపోయేది కర్ణాటక రైతులే.