న్యూఢిల్లీ: భారత్లో పిల్లల లైంగిక వేధింపుల సమాచారాన్ని ఇన్స్టాగ్రామ్ ప్రచారం చేస్తున్నదని బీబీసీ శుక్రవారం తన కథనంలో తెలిపింది. తీవ్ర అభ్యంతరకరమైన శీర్షికలతో ఉన్న యాడ్స్ను ఇన్స్టాలో తాము చూశామని పేర్కొంది. ఈ యాడ్స్ టెలిగ్రామ్ చానెల్స్తో లింక్ అయ్యి ఉన్నాయని వీటిని రూ.99లకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
దీనిపై స్పందించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయమై మెటా సంస్థ అధికారులకు సమన్లు జారీ చేయాలని తన శాఖను ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.