న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం పాట్నా హైకోర్టులో పని చేస్తున్న జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రస్తుతం బాంబే హైకోర్టులో పని చేస్తున్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ను నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎంఎస్ఎస్ రామచంద్రరావును పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేసింది. వీరితోపాటు తెలంగాణ, ఏపీ హైకోర్టులకు న్యాయమూర్తులను నియమించింది.
పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జస్వంత్ సింగ్ను ఒడిశాకు బదిలీ చేసింది. రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సబీనాను హిమాచల్ప్రదేశ్కు ట్రాన్స్ఫర్ చేసింది. ఒడిశా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజయ కుమార్ మిశ్రా.. ఉత్తరాఖండ్కు బదిలీ అయ్యారు. జస్టిస్ ఎంఎం శ్రీవాత్సవ ప్రస్తుతం పని చేస్తున్న ఛత్తీస్గఢ్ హైకోర్టు నుంచి రాజస్థాన్కు ట్రాన్స్ఫర్ అయ్యారు.
గుజరాత్ నుంచి పరేశ్ ఆర్ ఉపాధ్యాయను మద్రాస్ హైకోర్టుకు, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరిందం సిన్హాను ఒడిశాకు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం బాదర్ను పాట్నాకు బదిలీ చేశారు.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు నుంచి వివేక్ అగర్వాల్ను మధ్యప్రదేశ్కు, జస్టిస్ చంద్రధారి సింగ్ను అలహాబాద్ నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి జస్టిస్ అనూప్ చిత్కారాను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేశారు. ఇక అలహాబాద్ హైకోర్టులో పని చేస్తున్న రవినాథ్ తిల్హరిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు.