న్యూఢిల్లీ, నవంబర్ 25: కొలీజియంతో సహా ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థా పర్ఫెక్ట్ కాదని, ప్రస్తుతమున్న వ్యవస్థలోనే సమస్యకు పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని అమలు చేసే విశ్వాసపాత్రులైన సైనికులు న్యాయమూర్తులు అని అభివర్ణించారు. మంచి వ్యక్తులను న్యాయవ్యవస్థలోకి తెచ్చి మంచి వేతనాలు ఇచ్చినంత మాత్రాన కొలీజియంను సంస్కరించినట్టు కాదని అన్నారు. ప్రజాసేవకు అంకితమవ్వాలనే వ్యక్తులు జడ్జిలుగా అవుతున్నారని చెప్పారు.