న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ‘సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (సీటెట్)-2023 పరీక్షా ఫలితాల్ని సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సోమవారం విడుదల చేసింది. పేపర్-1లో 2.98 లక్షల మంది, పేపర్-2లో 1.01 లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులైనట్టు సీబీఎస్ఈ తెలిపింది.
అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చునని అభ్యర్థులకు సూచించింది. పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు క్లాస్ 1 నుంచి 5 వరకు, పేపర్-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు క్లాస్ 6 నుంచి 8 వరకు టీచింగ్ పోస్టులకు అర్హులు అవుతారు. పేపర్ 1 పరీక్షకు 15 లక్షల మందికిపైగా, పేపర్ 2కు 14 లక్షల మందికిపైగా హాజరయ్యారు. అయితే కేవలం 13.77 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.