Bahanaga railway station | బాలాసోర్, జూన్ 10: ఇటీవల సంభవించిన ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ప్రమాదం జరిగిన బాహానగా రైల్వే స్టేషన్ను సీల్ చేసింది. అంతకుముందే సీబీఐ అధికారులు స్టేషన్ లాగ్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున బాహానగా స్టేషనల్లో ఏ రైళ్లూ ఆగవని రైల్వే అధికారులు శనివారం వెల్లడించారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ స్టేషన్లో ఎలాంటి ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఆగవని వారు వెల్లడించారు. బాహానగా స్టేషన్ మీదుగా రోజూ దాదాపు 170 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. మరోవైపు ప్రమాద బాధితుల్లో 709 మందికి ఇప్పటికే పరిహారం అందించినట్టు అధికారులు తెలిపారు.