శ్రీనగర్ : తుపాకీ లైసెన్స్ కుంభకోణం కేసులో జమ్ముకశ్మీర్లోని 40 చోట్ల సీబీఐ శనివారం దాడులు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన ఐఏఎస్ అధికారి షాహిద్ చౌదరితో పాటు పలువురు అధికారులు కూడా సీబీఐ ముట్టడిలో ఉన్నారు. కథువా, రియాసి, రాజౌరి, ఉధంపూర్ జిల్లాల డిప్యూటీ కమిషనర్గా చౌదరి పనిచేశారు. ఈ కాలంలో ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నకిలీ పేర్లలో వేలాది తుపాకీ లైసెన్సులు జారీ చేసినట్లు చౌదరిపై ఆరోపణలు ఉన్నాయి.
జమ్ముకశ్మీర్ ఐఏఎస్ అధికారి షాహిద్ ఇక్బాల్ చౌదరి నివాసం సహా 40 ప్రాంతాల్లో సీబీఐ శనివారం ఉదయం దాడులు చేసింది. చౌదరి 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం గిరిజన వ్యవహారాల విభాగం అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ పదవిలో ఉన్నారు.తుపాకీ లైసెన్స్ల కుంభకోణం కేసుకు సంబంధించి ఎనిమిది మంది మాజీ డిప్యూటీ కమిషనర్లను కూడా సీబీఐ విచారిస్తున్నది.
రాజస్థాన్ ఏటీఎస్ ఈ కుంభకోణాన్ని 2017 లో బయటకు తీసి 50 మందికి పైగా నిందితులను అరెస్టు చేసింది. ఆర్టీ సిబ్బంది పేరిట 3 వేలకు పైగా పర్మిట్లు ఇచ్చినట్లు ఏటీఎస్ తేల్చింది. అనంతరం, అప్పటి జమ్ముకశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఈ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగించారు.
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా
చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్ ఇది
పైకి పెరిగిన భూమి.. హర్యానాలో వింత సంఘటన!.. వీడియో వైరల్..
ఈ శాండ్విచ్ చాలా కాస్లీ గురూ!
న్యాయం కోసం ఎదురుచూస్తూ చనిపోయిన 108 ఏండ్ల వ్యక్తి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..