న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను సీబీఐ శుక్రవారం విచారించింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కుంభకోణానికి సంబంధించిన కేసులో సాక్షిగా హాజరైన ఆయన స్టేట్మెంట్ను సీబీఐ ఐదు గంటల పాటు రికార్డు చేసింది. కేసు వివరాలు పరిశీలిస్తే.. సత్యపాల్మాలిక్ జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్సూరెన్స్కు సంబంధించిన కాంట్రాక్టును రద్దు చేశారు. 3.5 లక్షల మంది ప్రభుత్వ ఆరోగ్య బీమాకు సంబంధించిన ఈ కాంట్రాక్ట్ను 2018లో ప్రవేశపెట్టగా, దానిపై ఉద్యోగుల నుంచే ఫిర్యాదు రావడంతో నెలరోజులకే సత్యపాల్ మాలిక్ దానిని రద్దు చేశారు. ఆ పథకం మోసపూరితంగా ఉన్నందునే రద్దు చేసినట్టు మాలిక్ అప్పట్లో ప్రకటించారు. ఆ కాంట్రాక్టును పునరుద్ధరించాలని ఆరెస్సెస్ నేత రామ్మాధవ్ తనను కోరారని ఆయన వెల్లడించారు. కాంట్రాక్ట్ను పునరుద్ధరిస్తే రూ.300 కోట్లు లంచంగా ఇస్తామని తనకు ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ సత్యపాల్ను విచారించింది.