కోల్కతా: పశ్చిమ బెంగాల్లో భారీ స్థాయిలో టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee)ని సీబీఐ విచారించింది. కోల్కతాలోని సీబీఐ ఆఫీసుకు ఆయన వెళ్లారు. భారీ బందోబస్తు మధ్య నిజాం ప్యాలెస్లో ఉన్న సీబీఐ ఆఫీసుకు వెళ్లారు. స్కూల్ జాబ్స్ స్కామ్ కేసులోనే ఈడీ ఇవాళ ఉదయం సోదాలు చేసింది. టీఎంసీ నేత సుజయ్ కృష్ణ భద్ర ఇంట్లో తనిఖీలు చేశారు. మార్చి 15వ తేదీన రిక్రూట్మెంట్ స్కామ్లో భద్రను సీబీఐ విచారించింది. టీచర్ నియమాక విధానంలో జరిగిన క్రిమినల్ కోణాన్ని సీబీఐ విచారిస్తుండగా, దాంట్లో దాగిన ఆర్థిక కోణాన్ని ఈడీ దర్యాప్తు చేస్తోంది.