న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో ఓ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.2,200 కోట్ల పనుల కోసం లంచాలు చేతులు మారినట్టు వచ్చిన ఆరోపణలపై సీబీఐ సోదాలు జరిపింది. ఢిల్లీ, సిమ్లా, నోయిడా, చండీగఢ్లో ఆరు చోట్ల శనివారం సోదాలు చేపట్టింది. తాను గవర్నర్గా ఉన్నప్పుడు ఫైల్పై సంతకం పెడితే రూ.300 కోట్లు ఇస్తామని కొందరు ఆఫర్ ఇచ్చినట్టు సత్యపాల్ మాలిక్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపడుతున్నది. ఇందులో భాగంగానే సోదాలు జరిపింది.