న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మరింత చిక్కుల్లో పడనున్నారు. పార్లమెంట్లో ప్రశ్నలడగడానికి నగదు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది. ఇప్పటివరకు ఆమెపై ఉన్న ఆరోపణలకు సంబంధించి లభించిన వివరాల ఆధారంగా ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చునా అన్న అంశాన్ని ఈ దర్యాప్తును బట్టి నిర్ణయిస్తారు. మొయిత్రాను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని ఇప్పటికే ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది.