న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ మొదటిసారిగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును చార్జిషీట్లో చేర్చింది. ఈ కేసులో మంగళవారం స్పెషల్ కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేసింది.
ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, మద్యం వ్యాపారి అమన్దీప్ ధాల్లపై ఐపీసీ 120బీ , 201, 420 సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టం కింద పలు అభియోగాలు నమోదు చేసింది. లిక్కర్ కేసులో వీరి పాత్రపై విచారణ కొనసాగుతున్నదని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది.