న్యూఢిల్లీ: సీబీఐ చర్యలు తన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకొనేలా ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న కాలంలో దర్యాప్తు సంస్థల సోదాలపై వెంటనే మార్గదర్శకాలను జారీ చేయాలని ఆదివారం ఆమె ఈసీకి లేఖ రాశారు. మొయిత్రా పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ స్థానం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు.