పట్నా: దేశంలో కులాల వారీగా జనగణన చేపట్టాలనే అంశాన్ని మరోసారి లేవనెత్తారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. గతంలో కూడా పలుమార్లు ఆయన దేశంలో కులాల వారీగా జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాజాగా మరోసారి అదే అంశాన్ని లేవనెత్తారు. తాము బీహార్లో కులాల వారీ జనగణన మొదలుపెట్టాలని నిర్ణయించామని నితీశ్ వెల్లడించారు.
కులాల వారీ జనగణన ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనాలు సమానంగా అందుతాయని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కులాల వారీ జనగణన అవశ్యమని చెప్పారు. దేశం ప్రగతి పథంలో దూసుకుపోవాలంటే కులాల వారీ జనగణన చాలా ముఖ్యమని నితీశ్ పేర్కొన్నారు.