న్యూఢిల్లీ, జనవరి 31: మౌలిక రంగ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.10 లక్షల కోట్ల మూలధన వ్యయాలను ప్రతిపాదించారు. ఇది గత బడ్జెట్లో కేటాయించిన రూ.7.5 లక్షల కోట్ల కంటే 33 శాతం అధికం.
రేవులు, బొగ్గు, ఉక్కు, ఎరువులు, ఆహారధాన్యాల రంగాలకు సంబంధించి కీలకమైన 100 రవాణా మౌలిక ప్రాజెక్టుల్ని గుర్తించామని, వీటిని ప్రాధాన్యతా క్రమంలో రూ.15,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడితో సహా మొత్తం రూ.75,000 కోట్ల పెట్టుబడి పెడతామని ఆర్థికమంత్రి తెలిపారు. జాతీయ రహదారుల రంగానికి రూ.2.70 లక్షల కోట్లు కేటాయించారు.