Bihar polls : బీహార్ (Bihar) లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార మైకులు మూగబోయాయి. తొలి విడతలో భాగంగా మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 6న పోలింగ్ జరగనుంది. పోలింగ్ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
పోలింగ్ జరుగనున్న అన్ని స్థానాలకు ఎన్నికల సిబ్బందిని, పోలీసులను తరలిస్తున్నారు. సమస్యాత్మక స్థానాల్లో భద్రతను మరింత పిటిష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరనుంది.
కాగా బీహార్లోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు, రెండో విడతలో మిగతా 113 స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 11న రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారికి ఇంటివద్ద నుంచే ఓటువేసే అవకాశం కల్పించారు.