న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాల తేదీలను ఇవాళ పార్లమెంట్ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో కోవిడ్ ప్రవర్తనా నియమావళి ప్రకారం సభా వ్యవహారాలను సాగించనున్నారు. సుమారు నెల రోజుల పాటు సాగే సమావేశాల్లో 20 సిట్టింగ్స్ ఉండనున్నాయి. సాధారణంగా వర్షాకాల సమావేశాలు జూలై మూడవ వారంలో ప్రారంభమై.. స్వాతంత్య్ర దినోత్సవం లోపు పూర్తి అవుతాయి. కనీసం ఒక డోసు కోవిడ్ టీకా తీసుకున్న వారిని పార్లమెంట్లోకి ఎంటరయ్యే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.