న్యూఢిల్లీ: గంగానదిపై రూ.3,064 కోట్లతో 6 వరుసల తీగల వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. బీహార్లోని డిఘా, సోనేపూర్లను కలుపుతూ కొత్తగా 4.56 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. బుధవారం ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమైంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో భారత కాన్సులేట్ను తెరిచేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కొబ్బరికి మద్దతుధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణ రకం ఎండు కొబ్బరికి క్వింటాల్పై రూ.250, మిల్లింగ్ గ్రేడ్ ఎండు కొబ్బరి క్వింటాల్పై రూ.300 ఎమ్మెస్పీని పెంచుతున్నట్టు తెలిపింది.