న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పరిధిలో మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.
దాద్రానగర్ హవేలీ, హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం, మధ్యప్రదేశ్లోని ఖాండ్వా లోక్సభ స్థానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి.
అదేవిధంగా అసోంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు, బెంగాల్లో నాలుగు, మధ్యప్రదేశ్, మేఘాలయ, హిమాచల్ప్రదేశ్లో మూడు చొప్పున, బీహార్, కర్ణాటక, రాజస్థాన్లో రెండు చొప్పున, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, మిజోరంలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికల పోలింగ్ జరగుతున్నది. నవంబర్ 2న ఓట్లను లెక్కించనున్నారు.