న్యూఢిల్లీ: దేశంలో ఉపఎన్నికల నగారా మోగింది. ఆరు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు ఈసీ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ స్థానాల్లో జూన్ 23న పోలింగ్ జరుగుతుందని, 26న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ఉప ఎన్నికల స్థానాల జాబితాలో మేకపాటి గౌతంరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం కూడా ఉన్నది. యూపీలో రెండు, పంజాబ్లో ఒక లోక్సభ సీటుతోపాటు, త్రిపురలో నాలుగు, ఏపీ, జార్ఖంఢ్, ఢిల్లీలో ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి.