న్యూఢిల్లీ: వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ (Swaminathan)కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. అయితే రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై స్వామినాథన్ ఫార్ములాను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా ఉద్యమంలో 700 మంది రైతులు బలిదానాలు చేశారని అన్నారు. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని ఆరోపించారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావుతోపాటు ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న అవార్డులు ప్రకటించిన తర్వాత కూడా ఢిల్లీకి పాదయాత్ర చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని జైరాం రమేష్ పేర్కొన్నారు. అయితే రైతుల గోడును కేంద్ర ప్రభుత్వం వినడం లేదని సోషల్ మీడియా పోస్ట్లో ఆయన మండిపడ్డారు.
కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రధాన లక్ష్యాలలో ఒకటి రైతులకు న్యాయం చేయడం అని జైరాం రమేష్ తెలిపారు. స్వామినాథన్ ఫార్ములా ఆధారంగా రైతులకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వడం కోసమే తమ ‘కిసాన్ న్యాయ్’ డిమాండ్ అని అన్నారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, స్వామినాథన్లకు ఇదే నిజమైన నివాళి’ అని ఎక్స్లో పేర్కొన్నారు.
श्री पीवी नरसिम्हा राव, चौधरी चरण सिंह और डॉ एमएस स्वामीनाथन जी भारत के रत्न थे, हैं और सदैव रहेंगे। उनका योगदान अभूतपूर्व था, जिसका हर भारतीय सम्मान करता है।
डॉ स्वामीनाथन फ़ॉर्मूले के आधार पर किसानों को न्यूनतम समर्थन मूल्य का क़ानूनी दर्जा दिए जाने पर मोदी सरकार चुप है।… pic.twitter.com/drDz4U0KaT
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 9, 2024