డెహ్రాడూన్: యాత్రికులతో వెళ్తున్న బస్పు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది (Bus fell into gorge). ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. బస్సులో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. గుజరాత్కు చెందిన 35 మంది యాత్రికులు ప్రైవేట్ బస్సులో గంగోత్రి నుంచి ఉత్తరకాశీకి వెళ్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆ బస్సు అదుపు తప్పింది. రోడ్డు దిగువన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
కాగా, ఈ ప్రమాదంలో బస్సులోని ఏడుగురు యాత్రికులు మరణించారు. అందులో చిక్కుకున్న 27 మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. తాళ్ల సహాయంతో వారిని రోడ్డుపైకి తెచ్చారు. అలాగే బస్సులో ఇరుక్కుపోయిన ఒక వ్యక్తిని అతి కష్టంమీద కాపాడారు.
మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ప్రమాదంపై స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
VIDEO | "A bus carrying 35 people from Gangotri fell into a gorge in Uttarakhand's Uttarkashi. 27 injured have been rescued while 7 people have died. Rescue operation is underway," says Gaurav Kumar, chief development officer, Uttarkashi. pic.twitter.com/qUJilJ83rO
— Press Trust of India (@PTI_News) August 20, 2023