కల్వకుర్తి, మే 2 : గ్యారెంటీల గారడీ కాంగ్రెస్, కల్లోల బీజేపీని ఖతం చేస్తేనే ప్రజలకు మేలు చేకూరుతుందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. గురువా రం ఆమనగల్లులో నిర్వహించిన గిరిజన గర్జన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి ఆర్ఎస్పీ హాజరయ్యారు. అంతకుముందు పట్టణంలో గిరిజనులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహనికి పూ లమాల వేసి నివాళులర్పించారు.
గిరిజన గర్జన కా ర్యక్రమం అనంతరం మాడ్గుల, ఇర్విన్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్యాదవ్ మాట్లాడుతూ.. విద్యావంతుడైన ఆర్ఎస్పీని గెలిపిస్తే పేదల గొంతుక ఢిల్లీ గడ్డపై గర్జిస్తుందన్నారు. క ల్వకుర్తి నియోజకవర్గం నుంచి గతానికి మించిన మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి చాడ కిషన్రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్చార్జి రంగినేని అభిలాష్రావు, గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యానాయక్, మిషన్ భగీరథ మాజీ వైస్చైర్మన్ ఉప్పల వెంకటేశ్, జెడ్పీటీసీలు నేనావత్ అనురాధ, దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్రావు, జైపాల్రెడ్డి పాల్గొన్నారు.