జైపూర్: దేశంలో ప్రస్తుతం బుల్డోజర్ల రాజ్యం నడుస్తున్నది. అవి అక్రమ కట్టడాలైనా, పురాతన కట్టడాలైనా ఎడాపెడా కూల్చిపడెస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మైదలైన కూల్చివేతలు క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. అవి రాజకీయ కోణంలోనా లేదా ప్రజల అవసరాల కోసం జరుగుతున్నాయా అనే విషయం ప్రశ్నార్థకమే. తాజాగా రాజస్థాన్లో మూడు వందల ఏండ్ల నాటి పురాతన శివాలయాన్ని (Shiva temple) అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇప్పుడీ విషయం వివాదంగా మారుతున్నది.
రాజస్థాన్లోని అల్వార్ జిల్లా సరాయ్ మహల్లాలో ఉన్న పురాతన శివాలయాన్ని అధికారులు కూల్చివేశారు. దీనికి 300 ఏండ్ల ప్రాశస్త్యం ఉన్నదని స్థానికులు చెబుతున్నారు. ఈ కూల్చివేతపై నగర పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్, రాజ్ఘర్ ఎమ్మెల్యేపై స్థానిక పోలీస్ స్టేషన్లో పలువురు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయమై పోలీసులు ఇప్పటివరకు ఎవరిపై కేసు నమోదు చేయలేదు.
కాగా, న్యూఢిల్లీలోని జహంగీర్పురి కూల్చివేతలపై కాంగ్రేస్ నేతలు గొడవ చేస్తున్నారని, ఇప్పుడు రాజస్థాన్లో జరిగిందేమిటని రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ కూల్చివేత వీడియోలను ట్విటర్లో పోస్ట్ చేశారు.
राजस्थान के अलवर जिले में सराय मोहल्ले स्थित 300 साल पुराने शिव मंदिर को बुलडोजर से जमींदोज कर दिया गया है, ये वीडियो मंदिर गिराने का है देखिए…#Rajasthan #Alwar #ShivMandir #TempleDemolition #ATDigital #ATVertical pic.twitter.com/XNOmAL4IDS
— AajTak (@aajtak) April 22, 2022