రాంచీ: ఒక ఎద్దు ఒంటరిగా రైలులో ప్రయాణించింది. దానిని కంపార్ట్మెంట్లోకి ఎక్కించిన కొందరు, చివరి రైల్వే స్టేషన్లో దించమని అందులోని ప్రయాణికులను కోరారు. ఈ వింత సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. సుమారు 12 మంది వ్యక్తులు ఒక ఎద్దును మీర్జా చౌకి రైల్వే స్టేషన్కు తీసుకువచ్చారు. సాహిబ్గంజ్కు వెళ్లే ప్యాసింజర్ రైలులోని ఒక బోగిలోకి దానిని ఎక్కించారు. కంపార్ట్మెంట్ ఎంట్రన్స్ వద్ద ఉన్న సీటు హ్యాండిల్కు ఎద్దును కట్టేశారు. చివరి స్టేషన్ సాహిబ్గంజ్కు ఆ రైలు చేరుకున్న తర్వాత కట్టిన తాడు విప్పి దానిని కంపార్ట్మెంట్ నుంచి కిందకు దించాలని అందులోని ప్రయాణికులకు చెప్పి వెళ్లి పోయారు. దీంతో ఆ ఎద్దు ఒంటరిగా గమ్యస్థానం వరకు రైలులో ప్రయాణించింది.
మరోవైపు కంపార్ట్మెంట్లో ఎద్దు ఉండటంతో అందులోని ప్రయాణికులు దానిని ఖాళీ చేసి పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్లారు. కొద్ది మంది మాత్రమే అందులో ఉన్నారు. కాగా, దారికి అడ్డంగా ఎద్దు ఉండటంతో ఒక వ్యక్తి జంప్ చేసి డోర్ వద్దకు చేరుకున్నాడు. మొబైల్లో వీడియో రికార్డు చేసిన అతడు ఆ ఎద్దు రైలులోకి ఎలా ఎక్కింది అన్నది వివరించాడు.
కాగా, జర్నలిస్ట్ ప్రకాష్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎద్దు ఒంటరిగా రైలులో ప్రయాణించడంపై నెటిజన్లు జోకులు పేల్చారు. అయితే రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు.
अब इसे क्या कहेंगे! अब तक साइकिल, दूध का केन, सब्जी आदि लेकर बिहार की ट्रेनों में यात्रा करते देखा होगा. अब एक तस्वीर ये भी देखिए. मिर्जाचौकी से साहिबगंज जाने के दौरान मिर्जाचौकी रेलवे स्टेशन पर लोकल पैसेंजर में कुछ अज्ञातों ने क्या कारनामा किया है. वीडियो- भागलपुर से दिलीप pic.twitter.com/ELdIfXuE1s
— Prakash Kumar (@kumarprakash4u) August 5, 2022