న్యూఢిల్లీ: ఇవాళ కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. దానికి ముందు కేంద్ర క్యాబినెట్ భేటీలో ఆ బడ్జెట్కు ఆమోదం దక్కింది. పార్లమెంట్లో ఆ సమావేశం జరిగింది. నిర్మల నాలుగవ సారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. లోక్సభలో బడ్జెట్ను మంత్రి ట్యాబ్లెట్లో చూసి చదివారు. గతంలో బ్రీఫ్కేస్, బహీఖాతా పద్ధతుల్లో బడ్జెట్ ప్రతులతో పార్లమెంట్కు మంత్రులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే డిజిటల్ ఇండియాలో భాగంగా, కరోనా నేపథ్యంలో పేపర్ల వాడకాన్ని తగ్గిస్తూ మంత్రి సీతారామన్ 2022-23 బడ్జెట్ను ట్యాబ్లెట్లో చూస్తూ చదివారు.