న్యూఢిల్లీ: ప్రజల మానసిక ఆరోగ్యం కోసం, జాతీయ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐఐటీ బెంగళూరు సాంకేతిక మద్దతు అందిస్తుందని చెప్పారు. పార్లమెంట్లో మంగళవారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ కోసం జాతీయ టెలీ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
అలాగే నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ కోసం ఓపెన్ ప్లాట్ఫారమ్ను రూపొందించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డిజిటల్ హెల్త్ రిజిస్ట్రీలు, ఆరోగ్య సౌకర్యాలు, ప్రత్యేకమైన ఆరోగ్య గుర్తింపు, ఆరోగ్య సౌకర్యాలకు ఇది సార్వత్రికంగా అందుబాటులో ఉంటుందన్నారు.
కాగా, నేషనల్ టెలీ-మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ నాణ్యమైన, ప్రామాణికమైన, 24 గంటలు అందుబాటులో ఉండే ఉచిత సేవ అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. దేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.